Friday, September 20, 2024
spot_img

బంగ్లా లో తీరం దాటిన‌ రీమాల్‌ తుఫాన్‌

Must Read
  • ఈదురుగాలులతో బంగ్లాదేశ్‌ అతలాకుతలం
  • తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా ఈదురుగాల వర్షం
  • మొత్తం 15మంది చనిపోయి ఉంటారని అంచనా

తీవ్ర తుఫానుగా బలపడిన ’రెమాల్‌’ పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ఐలాండ్స్‌, బంగ్లాదేశ్‌లోని మంగ్లా పోర్టు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటలకు 120-135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రెమాల్‌ ఆదివారం రాత్రి బంగ్లాదేశాన్ని తీరాన్ని తాకిందని, బెంగాల్‌ తీరాన్ని దాటే పక్రియను ప్రారంభించిందని అక్కడి అధికారులు వెల్లడిరచారు. స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.00-1.00 మధ్య తీరాన్ని దాటిందని, ఆ తర్వాత రెమాల్‌ తుఫాన్‌ బలహీనపడుతుందని తెలిపారు. పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు విమాన సర్వీసులను రద్దు చేశారు. తుఫాన్‌ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో 8 లక్షల మందికి పైగా ప్రజలను అక్కడి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావంతో ఒడిశా, బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలపై రీమల్‌ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. ఓ వైపు ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే అంతలోనే వాతావరణం మారిపోతుంది. తెలంగాణలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల ధాటికి ప్రజలు ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. తుఫాన్‌ ప్రభావంతో పలు జిల్లాల్లో 15 మంది వరకు చనిపోయారు. భారీగా భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో వర్షం ధాటికి నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మల్లేష్‌ (38), అతని కుమార్తె అనూష (11), పెద్దకొత్తపల్లి మండలం ముష్ఠిపల్లికి చెందిన కూలీలు చెన్నమ్మ (37) రాములు(40) అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్‌ జిల్లా తిమ్మాయిపల్లిలో చెట్టుకొమ్మలు విరిగిపడి యాదాద్రి జిల్లా బొమ్మలరామారంనకు చెందిన నాగిరెడ్డి రామిరెడ్డి, ధనంజయ్య దుర్మరణం చెందారు. ములుగు మండలం క్షీరాసాగర్‌లో గోడ కూలి ఇద్దరు మరణించారు. ఈదురుగాలుల ధాటికి కోళ్లఫారం గోడ కూలడంతో గణపురం గ్రామానికి చెందిన గంగ గౌరీశంకర్‌ (30), చంద్రాయణగుట్టకు చెందిన భాగ్య(40) చుట్టాల వద్దకు వచ్చి మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నాగర్‌కర్నూల్‌ సమీపంలోని మంతటి చౌరస్తా దగ్గర షెడ్డుపై నుంచి సిమెంటు ఇటుకలు పడి వికారాబాద్‌ జిల్లా బషీర్‌బాద్‌ మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన వేణు (34) మృతి చెందాడు. అలాగే నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. బిజినేపల్లి మండలం నంది ఒడ్డెమాన్‌లో రైతు అంజన్‌రెడ్డి (49), తిమ్మాజీపేట మండలం మారేపల్లిలో రైతు కుమ్మరి వెంకటయ్య (55) పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురయ్యారు. తెలకపల్లికి చెందిన దండు లక్ష్మణ్‌ (12) పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. వనస్థలిపురం గణేష్‌ ఆలయం రోడ్డులో భారీ చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్‌ జాం అయ్యింది. పలు కార్లు దెబ్బతిన్నాయి. హయత్‌నగర్‌-1 డిపోలో చెట్టు విరిగి పడడంతో బస్సు ధ్వంసమసైంది. అర్థరాత్రి వరకు విద్యుత్‌ లేక చాలా కాలనీల్లో జనం అల్లాడిపోయారు. రాయదుర్గం, గచ్చిబౌలి, టీఎన్‌జీవో కాలనీ, గౌరవెలి ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలపై చెట్లు విరిగిపడ్డాయి. వర్షం ధాటికి ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్‌ సర్కిల్‌, గచ్చిబౌలి ఔటర్‌ సర్కిల్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాం ఏర్పడిరది. రీమల్‌ తుఫాన్‌ దాటికి తెలంగాణలో వర్షాలు కురవగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ హెచ్చరించారు. తీవ్ర తుఫాన్‌ ప్రభావంతో ఏపీలోని ప్రధాన ఓడరేవుల్లో ఆదివారం రెండవ నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఉప్పాడ బీచ్‌ రోడ్డు నుంచి కాకినాడ వెళ్లే వివిధ వాహనాల రాకపోకలను కొత్తపల్లి మండల పోలీసులు ఆపేశారు. గోర్స, పండూరు, పిఠాపురం మీదుగా కాకినాడ చేరుకోవాలని సూచించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This