Friday, September 20, 2024
spot_img

టీటీడీ మాదిరిగా యాదగిరిగుట్ట అభివృద్ధి

Must Read
  • గుట్ట అభివృద్ధి పై సీఎం కీలక ఆదేశాలు
  • యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు నియామకం

యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలనీ సీఎం రేవంత్ ఆదేశించారు.టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి,విధి విధానాలు ఉండాలని సూచించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ,యాదగిరిగుట్ట ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ఆదేశించారు.ఆలయ అభివృద్ధి పనులపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని తెలిపారు.కీసర గుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా నిర్ణయం తీసుకున్నారు.ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా,అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని పేర్కొన్నారు.అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర ఆలయం పునర్మిర్మాణం చేపట్టాలని అధికారులను సూచించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This