Friday, September 20, 2024
spot_img

నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి జీవితాలను ఆగం చేయొద్దు

Must Read
  • టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్

పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ విమర్శించారు.శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ,తెలంగాణ ఉద్యమం పేరిట ఆనాడు యువతను రెచ్చగొట్టి వారి బలిదానాలకు కెసిఆర్,హరీష్ రావు,కేటీఆర్ లు కారణమయ్యారని ఆరోపించారు.ఇప్పుడు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్,ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఇంటికో ఉద్యోగం ఇవ్వడం కుదరదని మాట మార్చిన చరిత్ర కెసిఆర్ ది అని వెల్లడించారు.తన 10 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు.ఉద్యోగాల ఖాళీల గుర్తింపు కోసం నియమించిన ఐఏఎస్ కమిటీ సుమారు మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇచ్చిన నివేదికను కూడా కేసీఆర్ పక్కన పెట్టారని విమర్శించారు.ప్రశ్నించిన వారిని గొంతు నొక్కిందుకే పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ చేసారని విమర్శించారు.ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు.ఉద్యోగాల భర్తీ విషయంలో బిజెపి,బీఆర్ఎస్ కు ప్రశ్నించే అర్హత లేదని తెలిపారు.రాజకీయ ఉనికి కోసం యువతను మరోసారి బలిచేస్తారా అని ప్రశ్నించారు.నిరుద్యోగులతో దీక్షలు,ఆందోళనలు చేయిస్తూ తెర వెనుక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.ఆ నిరసనలలో నిరుద్యోగుల కంటే ఎక్కువ బీఆర్ఎస్ శ్రేణులే ఉన్నారని పేర్కొన్నారు.మీ హాయంలో కనీసం నిరుద్యోగులు బాధ వినకుండా వారి గొంతు నొక్కిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు.తమ సర్కారు ఉద్యోగాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 28,942 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారని పేర్కొన్నారు.కోర్టు కేసులను ఛేదించి గ్రూప్ 1,గ్రూప్ 2 నియామకాల కోసం ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.మరోసారి బీఆర్ఎస్ ఉచ్చులో యువత పడొద్దని ఆయన సూచించారు.జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఉద్యోగ నియామకాలు ప్రభుత్వం చేపడుతుందని వివరించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This