Friday, April 18, 2025
spot_img

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

Must Read

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.గురువారం ఏపీ నుండి హైదరాబాద్‎కు వచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం నందిగం సురేష్‎ను మియాపూర్ లో అరెస్ట్ చేశారు.గత వైసీపీ ప్రభుత్య హయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో అయినను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నందిగం సురేష్‎తో పాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి భర్త శ్రీనివాస్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించారు.మరోవైపు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నాయకులు వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.2021 అక్టోబర్ 19న మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు,కార్యకర్తలు దాడి చేశారు.ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసింది.

Latest News

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు అవార్డ్

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్‌ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS