Friday, September 20, 2024
spot_img

గాజులరామారం లో జరిగిన ఘటన పై జిహెచ్ఎంసి కమిషనర్ సీరియస్

Must Read
  • ఇద్దరు ఎస్ఎఫ్ఏ లను విధుల నుంచి తొలగించిన జోనల్ కమిషనర్

కూకట్ పల్లి జోన్ గాజులరామారం సర్కిల్ లో మహిళ శానిటేషన్ వర్కర్ పై లైంగిక వేధింపుల వార్తల పై జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన పై పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూకట్ పల్లి జోనల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఆఫీసర్ ల తో విచారణ జరిపించారు వారు నివేదిక అందించడంతో కఠినమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. దీంతో శానిటేషన్ సూపర్వైజర్ లు పి.కిషన్, సిహెచ్. ప్రణయ్ లను విధుల నుండి జోనల్ కమిషనర్ తొలగించారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జి హెచ్ ఎం సి కమిషనర్ హెచ్చరించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This