నేపాల్ లో వరద బీభత్సం కొనసాగుతుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పొటెత్తాయి. వరదలు,కొండచరియలు విరిగిపడటంతో సుమారుగా 170 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 111 మంది గాయపడ్డారని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ పోఖరెల్ తెలిపారు. ఇక ఈ వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. వెయ్యికి పైగా ఇళ్లు,వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. 4000 మందిని నేపాల్ సైన్యం రక్షించిందని రిషిరామ్ పోఖరెల్ తెలిపారు.