Friday, September 19, 2025
spot_img

భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష

Must Read
  • ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు
  • భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత సమీక్ష
  • రాష్ట్రవ్యాప్తంగా 09 మంది మరణించారని అధికారికంగా వెల్లడించిన
    హోంమంత్రి అనిత
  • 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.భారీ వర్షాలు,వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 09 మంది మరణించారని అధికారికంగా ప్రకటించారు.294 గ్రామాలు ముంపు బారిన పడ్డాయని,13,227 మందిని పునరావాస శిబిరాలకు తరలించమని వెల్లడించారు.14 జిల్లాల్లో భారీ వర్షాలు,వరదల కారణంగా 1,56,610 ఎకరాల్లో వరిపంట మునిగిందని,18,045 ఎకరాల మేర ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని తెలిపారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఏడు జిల్లాల్లోని 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.అత్యవసర సమయంలో రెస్క్యూ చేసేందుకు హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఉంచామని వెల్లడించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This