Friday, September 20, 2024
spot_img

రామోజీరావు మరణం పట్ల జ‌గ‌న్ దిగ్బ్రాంతి

Must Read
  • తెలుగు పత్రిక రంగానికి రామోజీరావు దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారు : వై.ఎస్ జగన్

ఈనాడు అధినేత రామోజీ రావు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు.రామోజీరావు మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ రావును హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుప్రతికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఇప్పటికే రామోజీరావు మరణం పట్ల నరేంద్ర మోడీ,చంద్రబాబునాయుడు,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అనేకమంది రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రామోజీరావు మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.తెలుగునాట పత్రిక రంగానికి అనేక దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారని,అయిన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తునట్టు జగన్ ట్వీట్ చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This