Friday, September 20, 2024
spot_img

ఏడీ శ్రీనివాసులు ‘భూ’ మాయజాలం

Must Read

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అవినీతి అనకొండ
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అరాచకాలు
సర్కారు భూములను కబ్జాకోరులకు కట్టబెడుతున్న ఆఫీసర్
అక్రమార్కుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న వైనం

రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె. శ్రీనివాసులు ‘భూ’ మాయజాలంకు పాల్పడుతున్నాడు. గత కొన్నేళ్లుగా రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఈయన కబ్జాకోరులకు అండగా నిలుస్తూ కోట్లు దండుకుంటున్నాడు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్ మెంట్ లో పెత్తనం చెలాయిస్తూ భూముల హద్దులను మార్చుతున్నాడు. డబ్బులకు కక్కుర్తీపడి ఒకరి భూముల హద్దులను చెరిపి మరోకరికి అంటగడుతున్నాడు. గవర్నమెంట్ భూములు అన్యక్రాంతం కావడానికి కారణమయ్యాడు. ప్రభుత్వ భూములపై ప్రైవేటు వ్యక్తులను పురమాయించి వారి వద్దనుంచి పర్సంటేజీ రూపంలో కోట్లు వసూలు చేస్తున్నాడు. సప్లిమెంటరీ సేతువాల్ జారీ చేయడం, తప్పుడుగా హద్దులు చూపడం వంటి అనేక ఆరోపణలు రావడం జరిగింది. లక్షల్లో జీతం తీసుకుంటూ ఇంత తతాంగం చేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లాలో ఏండ్లుగా పనిచేస్తున్న సారూ అనేక అక్రమాలకు పాల్పడుతూ వస్తున్నాడు. ఇతనిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు ఆయనకు మేడ్చల్ జిల్లా ఇంఛార్జీగా అదనపు బాధ్యతలు అప్పగించడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. అవినీతి అనకొండ ఏడీ శ్రీనివాసులుపై పూర్తి ఆధారాలతో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This