Friday, September 20, 2024
spot_img

సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పాయం పాదయాత్ర

Must Read

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధి లో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాదయాత్ర చేపట్టారు.మున్సిపాలిటీ పరిధి లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు వచ్చాయని అందుకే ఈ పాదయాత్ర చేస్తున్నానని పాయం అన్నారు.. గత పదేళ్లుగా మున్సిపాలిటీ లో పాలక వర్గ ఎన్నికల నిర్వహణ లేదని మున్సిపాలిటీ అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మణుగూరు మున్సిపాలిటీ గా రూపాంతరం చెందిన తరవాత ఇక్కడ గిరిజనేతరులు నివసించడానికి ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదని.కొనుగోలు చేసిన వారి పేరు మీద ఇంటి పనులు ఇవ్వటం లేదని,మున్సిపాలిటీ రద్దు చేసి పంచాయతీ గా మార్చాలని పాయం ను ప్రజలు కోరుతున్నారు.ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ మున్సిపాలిటీ లో నెలకోన్న అన్ని సమస్యలు నా దృష్టికి వచ్చాయని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.అంతే కాకుండా ప్రతి అధికారి ప్రజలకు సేవ చేయాలని,వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This