Friday, September 20, 2024
spot_img

అమిత్‌షాకు లైన్‌ క్లీయర్‌ చేస్తున్న మోడీ

Must Read
  • అందుకోసం బిజెపిలో సీనియర్లకు మొండిచేయి
  • ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్య

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు. అమిత్‌ షాను ప్రధానిని చేయడం కోసం.. ఆ పార్టీలోని సీనియర్‌ నేతలు శివరాజ్‌ సింగ్‌, వసుందర రాజే, ఖతర్‌ సాహెబ్‌, డాక్టర్‌ రమణ్‌ సింగ్‌లను పక్కన పెట్టారని ఆరోపించారు. నేడో రేపో యూపీ ప్రస్తుత సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను సైతం పక్కన పెడతారన్నారు. అందుకు సంబంధించిన ప్రచారం సైతం ఇప్పటికే ప్రారంభ మైందని చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేజీవ్రాల్‌ మాట్లాడారు. 2019లో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా కేజీవ్రాల్‌ గుర్తు చేశారు. బీజేపీలో 75 ఏళ్లు వచ్చినా.. ఆ వయస్సు దాటిన నాయకులంతా తప్పకుండా రిటైర్‌ కావాల్సిందేనని అమిత్‌ షా స్పష్టం చేశారన్నారు. అందులో ఎటువంటి రాజీ లేదని అమిత్‌ షా చెప్పారన్నారు. కావాలంటే.. నాడు అమిత్‌ షా చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇంటర్నెట్‌లో చెక్‌ చేసుకోవచ్చునంటూ కేజీవ్రాల్‌ సూచించారు. అయితే ఆ రూల్‌ ప్రకారమే బీజేపీలోని సీనియర్లు ఎల్‌ కె అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, సుమిత్రా మహాజన్‌ తదితరులంతా పార్టీ నుంచి తప్పుకున్నారన్నారు. ఇటువంటి నేపథ్యంలో బీజేపీలో ప్రస్తుతమున్న నాయకాగణం సైతం ఆ రూల్‌ ప్రకారం నడుచుకోవాల్సిందేనని కేజీవ్రాల్‌ అభిప్రాయపడ్డారు. ఢల్లీి మద్యం కేసులో మనీ లాండరింగ్‌ వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 21న ఢల్లీి సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. అనంతరం ఆయన తీహాడ్‌ జైలుకు తరలించింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ తరఫున ప్రచారం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టులో ఆయన బెయిల్‌ పిటిషన్‌ వేశారు. నేపథ్యంలో కేజీవ్రాల్‌కు సుప్రీంకోర్టు ఇటీవల కండిషన్లతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం ఢల్లీిలోని తన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా బీజేపీ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకొని కేజీవ్రాల్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులోభాగంగా 2025, సెప్టెంబర్‌ 17వ తేదీతో ప్రదాని నరేంద్ర మోదీకి 75 ఏళ్లు వస్తాయన్నారు. బీజేపీ పెట్టుకున్న రూల్‌ ప్రకారం.. 75 ఏళ్లు వచ్చిన వారు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాల్సి ఉంటుదన్నారు. ఆ క్రమంలో మోదీ రిటైర్‌మెంట్‌ కాక తప్పదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరంటూ బీజేపీ నేతలకు సూటిగా కేజీవ్రాల్‌ సవాల్‌ విసిరారు. దీనిపై కేంద్ర మంత్రి అమిత్‌ షా స్పందించారు. మూడోసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీనే ఉంటారని అమిత్‌ షా స్పష్టం చేశారు. అటువంటి వేళ.. కేజీవ్రాల్‌ బీజేపీలో అమిత్‌ షాను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు మోదీ ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నారని కేజీవ్రాల్‌ ఆరోపించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This