Monday, March 31, 2025
spot_img

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేష్‌కుమార్ గౌడ్‌..?

Must Read

తెలంగాణ కొత్త పీసీసీ (TPCC) చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం ముగిసింది. కొత్త పీసీసీ అధ్యక్ష పదవిపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh kumar goud) పీసీసీ చీఫ్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanthreddy), మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ ఎంపికపై అధికారికంగా రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పీసీసీ రేసులో మధు యాష్కి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు కేబినెట్ విస్తరణపైనా ఏఐసీసీ సమావేశంలో చర్చించారు.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS