Friday, October 3, 2025
spot_img

పిఠాపురంలో పవన్ గెలుపు

Must Read
  • 70 వేల మెజారిటీతో ఘన విజయం
  • తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్న పవన్ కళ్యాణ్
  • జనసేనని గెలుపుతో కార్యకర్తల సంబరాలు
  • ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ జోరుగా ప్రచారం..

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు.వైసిపి అభ్యర్థి వంగ గీతపై 70 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు.ఇంకా కొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు.గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు అత్యధిక ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది.పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.తొలిసారిగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడ్తుండడంతో అయిన అభిమానులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా సెలబ్రేటిస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.మరో వైపు పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This