Friday, October 3, 2025
spot_img

ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్, ఈసీకి నోటీసులు

Must Read

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కేంద్రంతో పాటు ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలని బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇదే అంశంపై పెండింగ్ లో ఉన్న పలు కేసులతో కలిపి దీన్ని విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి , ఈసీకి నోటీసులు జారీచేసింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This