Wednesday, April 2, 2025
spot_img

తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ రావు

Must Read

ఈనాడు సంస్థ అధినేత రామోజీ రావు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై వైద్యులు రామోజీ రావుకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల రామోజీ రావుకు స్టంట్ వేయగా కొద్దికాలం పాటు అయిన ఆరోగ్యాంగా ఉన్నారు. ఒకేసారి ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రామోజీ రావును ఆసుప్రతికి తరలించారు. రామోజీ రావు ఆరోగ్యం ఎలా ఉందని మీడియాతోపాటు రాజకీయ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. 87 ఏళ్ల రామోజీ రావు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు.

అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం ఇప్పటివరకు వైద్యులు వెల్లడించలేదు. 24 గంటలు గడిస్తే కానీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసే అవకాశం ఉంది. కాగా రామోజీ రావు మీడియాతోపాటు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనాడు సంస్థలు, రామోజీ ఫిల్మ్‌ సిటీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ప్రియా ఫుడ్స్‌ వంటి వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీ రావు నడిపిస్తున్నారు. తెలుగు మీడియాలో ప్రధానమైన ఈనాడు సంస్థ ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS