Monday, August 18, 2025
spot_img

తుదిశ్వాస విడిచిన రతన్ టాటా ,సంతాపం తెలిపిన ప్రముఖులు

Must Read

దిగ్గజ వ్యాపారవేత్త , టాటా గ్రూప్స్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. బుధవారం ముంబయిలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాల వల్ల సోమవారం అయిన ఆసుపత్రిలో చేరారు. రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది మూర్ము , ప్రధాని మోదీతో సహ పలుపురు రాజకీయ ప్రముఖులు , సినీ ప్రముఖులు , విదేశ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సంతాపం తెలిపారు.

మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం అధికారికంగా రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది. మరోవైపు రతన్ టాటా మృతి పట్ల మహారాష్ట్ర సీఎం ఏక్‎నాథ్ షిండే గురువారం రాష్ట్రంలో సంతాప దినాన్ని ప్రకటించారు. రతన్ టాటా భౌతికాయనికి నివాలర్పించేందుకు ఉదయం 10 నుండి సాయింత్రం 04 గంటల వరకు ఎన్సీపీఏ లో ఉంచనున్నారు. రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్రం నుండి హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS