Thursday, September 19, 2024
spot_img

సుప్రీంకోర్టులో జోగి రమేష్,దేవినేనీ అవినాష్‎కు ఊరట

Must Read

గత వైసీపీ ప్రభుత్వ హయంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేనీ అవినాష్,జోగి రమేష్ సహ ఐదు మంది వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఈ మేరకు వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.48 గంటల్లో పాస్‎పోర్టులను అప్పగించాలని ఆదేశించింది.అరెస్ట్ నుండి వారికి రక్షణ కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిచిన విచారణకు హాజరు కావాలని తెలిపింది.తదుపరి విచారణను నవంబర్ 04కి వాయిదా వేసింది.టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి కేసులో దేవినేనీ అవినాష్,జోగి రమేష్ నిందితులుగా ఉన్నారు.ముందస్తు బెయిల్ కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు.పిటిషన్ పై జస్టిస్ సుధాన్షు దులియా,జస్టిస్ అమానుల్లా ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

Latest News

నిఖత్ జరీన్‎కు డీఎస్పీ ఉద్యోగం

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం నిజామాబాద్ జిల్లాకు...
- Advertisement -spot_img

More Articles Like This