Thursday, April 17, 2025
spot_img

భారత్ లోకి అడుగుపెట్టిన షేక్ హసీనా,అప్రమత్తమైన బీఎస్ఎఫ్

Must Read

బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసినా భారత్ చేరుకున్నారు.బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పింది.రిజర్వేషన్‌ల అంశంలో చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారింది.దింతో షేక్ హసినా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు అక్కడి మీడియా పేర్కొంది.సైన్యంకి చెందిన ఓ హెలికాఫ్టర్ లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయారని తెలిపింది.షేక్ హసీనా భారత్ కి వెళ్లినట్టు మరికొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.ఇదిలా ఉండగా ఉత్తర్ ప్రదేశ్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో హసినా విమానం ల్యాండ్ అయింది.అక్కడి నుండి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరారు.ఢిల్లీ నుండి లండన్ కి బయల్దేరి వెళ్తారని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో బాంగ్లాదేశ్ పాలన ప్రస్తుతం సైన్యం ఆధీనంలోకి వెళ్ళింది.మరోవైపు బాంగ్లాదేశ్ లో పరిస్థితిలు అదుపుతప్పడంతో భారత్-బాంగ్లాదేశ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు .కూచ్‌బెహార్‌,పెట్రాపోల్‌ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ భద్రతాను కట్టుదిట్టం చేసింది.భారత్‌లోని బంగ్లాదేశ్‌ ఎంబసీ తో హైకమిషన్ వద్ద భద్రతాను పెంచారు.

Latest News

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు అవార్డ్

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్‌ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS