Friday, September 20, 2024
spot_img

ఖమ్మం జిల్లాలో విచిత్ర సంఘటన..

Must Read

ఐదేళ్ల తరువాత పుట్టింటికి వచ్చిన కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా విజయలక్ష్మీ . 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతాడంటూ కుటుంబసభ్యులతో ఛాలెంజ్ చేసిన విజయలక్ష్మీ. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడంటూ ఛాలెంజ్ చేసిన కుటుంబసభ్యులు..2019 ఎన్నికల్లో జగన్ ఏపీ సీఎం కావడంతో ఒప్పందం ప్రకారం సొంతూరుకు వెళ్లని విజయలక్ష్మీ. చంద్రబాబు సీఎం అయిన తరువాతే ఊర్లో అడుగుపెడతానంటూ శపథం. ఇటీవల ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం ఐదేళ్ల తరువాత సొంత గ్రామం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం చేరుకున్న విజయలక్ష్మీ. ఐదేళ్ల తరువాత స్వగ్రామానికి వచ్చిన విజయలక్ష్మికి ఘనంగా స్వాగతం పలికిన కుటుంబసభ్యులు, గ్రామస్థులు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పుట్టింట్లో అడుగుపెట్టిన విజయలక్ష్మీ. శపథం నెరవేరడంతో స్వగ్రామం చేరుకున్న విజయలక్ష్మిని సత్కరించిన కుటుంబసభ్యులు , గ్రామస్థులు

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This