Thursday, February 6, 2025
spot_img

రాష్ట్రానికి రూ.176.5 కోట్లు విడుద‌ల‌

Must Read
  • మైలిస్టోన్ 1, మైలిస్టోన్ 2 పథకాలలో 51.5 కోట్లు, రూ125 కోట్ల అర్హ‌త‌

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శుభవార్త అందించింది. జాతీయ రోడ్డు రవాణా శాఖ తాజాగా తెలంగాణకు రూ. 176.5 కోట్లు నిధులు ప్రకటించింది. జాతీయ రోడ్డు రవాణా శాఖ రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్ధిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం నిర్వహణలో కీలకమైన మైలెస్టోన్స్ సాధించినందుకు, తెలంగాణ రాష్ట్రానికి అదనపు ప్రోత్సాహక సహాయం అందించనుంది కేంద్ర సర్కార్‌. తెలంగాణ రాష్ట్రం మైల్స్టోన్ 1 మరియు మైల్స్టోన్ 2 పథకాలలో 125 కోట్లు, 51.5 కోట్లు అర్హత సాధించిందని ప్రకటన విడుదల అయింది. తెలంగాణ రాష్ట్రం మోటార్ వెహికల్ టాక్స్ కన్సెషన్ ఇచ్చినందుకు అర్హత 50 కోట్లు గా ఉంది. మైలెస్టోన్స్ 2 లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం 15 ఏండ్లు పైబడి ఉన్న రవాణా వాహనాలు తొలగించడానికి స్క్రాప్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ను పంపినది. ఈ పథకం కింద 75 కోట్లు అర్హత సాధించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం జిల్లాలలో 21 జిల్లాలు ప్రయారిటీగా తీసుకున్నందుకు 31.5 కోట్లు అర్హత సాధించింది, 20 కోట్లు ప్రాధాన్యత లేని జిల్లాల కోసం. మొత్తం 50.5 కోట్లు ప్రోత్సాహకం అందిస్తుంది. దీంతో తెలంగాణకు ఊరట లభించనుంది.

Latest News

టెట్‌ పరీక్షల్లో 83,711 మంది అభ్యర్థులు అర్హత

రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS