Friday, September 20, 2024
spot_img

ముగిసిన ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

Must Read

శనివారం ప్రజాభవన్ లో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది.సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,అధికారులు స్వాగతం పలికారు.అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్,ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కందుల దుర్గేష్‌,సత్యప్రసాద్‌, శ్ బీసీ జనార్ధన్‌రెడ్డి,ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కార్యక్రమ ప్రారంభంలో రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కాళోజీ నారాయణ రావు రాసిన “నా గొడవ” పుస్తకాన్ని బహుకరించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This