Friday, September 20, 2024
spot_img

కరీంనగర్ అభివృద్ది కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా

Must Read

( కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ )

రామాయణ సర్క్యూట్ కింద ఇల్లంతకుంట,కొండగట్ట అలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని అన్నారు కేంద్రమంత్రి బండిసంజయ్.ఆదివారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని అన్నారు.రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతాం అని వెల్లడించారు.ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరినా కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరించారని మండిపడ్డారు. కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదని తెలిపారు.కరీంనగర్ -హాసన్ పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే జరిగిందని, రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణంపై నిర్ణయం జరుగుతుందని అన్నారు.రాజస్తాన్,మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి వచ్చిన విజ్ఝప్తుల మేరకే కేంద్రం గడువు పొడిగించిందని తెలిపారు.గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్ కు మరిన్ని నిధులు వచ్చే అవకాశముందని అన్నారు.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని వెల్లడించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This