Monday, August 18, 2025
spot_img

అత్యాచార కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు

Must Read
  • మైనర్‌ బాలికలపై నలుగురు యువకులు అత్యాచారం

14 ఏళ్ల మైనర్‌ లంబాడా అమ్మాయిపై నలుగురు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన రెండు సంవత్సరాల క్రితం చత్రినాక వద్ద చోటు చేసుకుంది. నిందితులు, అమ్మాయిని మాయమాటలు చెప్పి ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మద్యం తాగించేందుకు యత్నించారు. ఆమె నిరాకరించగా, నిందితులు ఆమెను లైంగికంగా వేధించారు. ఒకరు ఆమె పొట్టపై తన్నడంతో, ఆమె అచేతనంగా పడిపోయింది. కొన్ని గంటల తర్వాత, ఆమె స్పృహ లోకి వచ్చింది. తన బట్టలు చిరిగిపోయి ఉన్నాయని, శరీరంలో నొప్పిగా అనిపించిందని తెలిపింది. ఆపై, అక్కడి నుంచి బయటకు వచ్చి పరుగెత్తి.. తల్లిదండ్రులకు జరిగిన విషయం వివరించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులపై సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపు కేసు నమోదైంది. న్యాయ విచారణలో నిందితులు అమ్మాయిని వివాహం చేసుకోవాలని కోరారు. అయితే ఆమె న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగించింది. మేజిస్ట్రేట్‌ సమక్షంలో నిర్వహించిన ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌లో, బాలిక నిందితులను స్పష్టంగా గుర్తించింది. కోర్టులో పలుమార్లు నిందితుల తరపు న్యాయవాదులు క్రాస్‌ ఎక్జామినేషన్‌ చేసినా బాలిక ధైర్యంగా నిలబడిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. కోర్టు బాలికకు రూ.7 లక్షల పరిహారం మంజూరు చేసింది. అయితే, బాలికను ఈ ప్రమాదంలోకి లాగిన స్నేహితురాలు ఇంకా జువెనైల్‌ న్యాయ మండలిలో విచారణ ఎదుర్కొంటోంది. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు మైనర్‌ గా ఉన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులకు కోర్టు కఠినమైన శిక్ష విధించింది. ఇద్దరు నిందితులకు 25 సంవత్సరాల శిక్ష విధించగా, మరో ఇద్దరికి 5 సంవత్సరాల శిక్ష విధించింది. ఘటన అనంతరం బాధిత బాలికను వివాహం చేసుకునేందుకు నిందితులు సిద్ధ పడ్డారు. కానీ బాలిక న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగించి నిందితులకు శిక్ష పడేలా పోరాటం చేసిందని పోలీసులు తెలిపారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS