Wednesday, July 2, 2025
spot_img

బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి, 11 మంది మృతి

Must Read

లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయిల్ వైమానిక దళాలు మిస్సైళ్ల‌తో దాడి చేశాయి. ఈ దాడిలో 11 మంది మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. 08 అంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 04 గంటలకు ఈ దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు తెలిపారు. బీరుట్‎లోని దక్షిణ శివార్లలో హిజ్బుల్లా బలమైన స్థావరమైన దహియెహ్‎లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు సైన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Latest News

పోచారం మున్సిపల్ కమిషనర్ కమీషన్ కంత్రి దందా

అవినీతి అధికారులకు అధికార పార్టీ అండగా ఉండటం మరో దరిద్రం.. రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రజలకు పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలంటే నిధులు లేవంటున్నారు.. నియామకాలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS