Sunday, June 8, 2025
spot_img

మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్

Must Read
  • మెయిన్స్ కు అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు
  • ఈసారి ట్యాబ్ లలో ప్రశ్నాపత్రం

ఏపీలో గ్రూప్​-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించనుంది. ప్రిలిమ్స్​లో 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించగా వారిలో 1:50 చొప్పున అభ్యర్థులను మెయిన్స్​కి ఎంపిక చేసింది.

2023 డిసెంబర్​లో అప్పటి వైసీపీ(YCP) ప్రభుత్వం 89 గ్రూప్​-1 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 మార్చి 17న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌ను నిర్వహించింది. వైసీపీ సర్కార్ ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రిలిమ్స్ నిర్వహించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, మెయిన్స్ పరీక్ష రాసేందుకు తగిన గడువును ఇవ్వాలని కమిషన్‌ను పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు .

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అమలాపురంలో మెయిన్స్‌ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్​లో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి కార్యదర్శి ఐ . నరసింహమూర్తి తెలిపారు. మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్‌లలో పొందుపరచి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS