Sunday, June 8, 2025
spot_img

హుస్సేన్‌సాగర్‌ ప్రమాద ఘటనలో ఒకరి మృతి

Must Read
  • గల్లంతైన యువకుడి కోసం విస్తృతంగా గాలింపు

హుస్సేన్‌సాగర్‌ అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. రెండు రోజుల క్రితం భారతమాతకు హారతి కార్యక్రమంలో అగ్నిప్రమాదం జరుగగా బోటు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గణపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించారు. అయితే 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ గణపతి మంగళవారం మృతిచెందాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అలాగే బోటు ప్రమాదం సమయంలో గల్లంతైన యువకుడు అజయ్‌ కోసం గాలింపు కొనసాగుతోంది. రెండో రోజు హుస్సేన్‌సాగర్‌లో రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS