Tuesday, October 14, 2025
spot_img

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు అవార్డ్

Must Read

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్‌ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్ బిజినెస్ & సోషల్ ఫోరమ్ కార్యక్రమంలో, సంస్థకు ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్స్ & లీడర్స్ 2024–25 అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మునగాల మోహన్ శ్యాం ప్రసాద్ స్వీకరించారు. ఈ సందర్భంగా మునగాల మోహన్ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ గౌరవం తెనాలి డబుల్ హార్స్ కుటుంబానికి మాత్రమే కాక, మాతో కలిసిన ప్రతి వినియోగదారుడు, డిస్ట్రిబ్యూటర్, భాగస్వామి నమ్మకానికి అద్దంపడుతోంద‌న్నారు. “ఈ గుర్తింపు మా ప్రయాణంలోని ఓ మైలురాయి. ఇది తెనాలి అనే చిన్న పట్టణం నుండి ప్రపంచ స్థాయిలో విశ్వసనీయత సంపాదించిన మా ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ గౌరవాన్ని మా బృందం, రైతులు, వ్యాపార భాగస్వాములు మరియు మా మీద నమ్మకాన్ని ఉంచిన ప్రతి వినియోగదారుడికి అంకితం చేస్తున్నాము. మేడ్ ఇన్ తెనాలి, మేడ్ ఫర్ ది వరల్డ్” అన్న సిద్ధాంతంతో మా ప్రయాణం కొనసాగుతుంది. “ అని మోహన్ శ్యాం ప్రసాద్ అన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This