Wednesday, June 25, 2025
spot_img

శాంతి క్రిష్ణ సేవలు మరింత ముందుకు సాగాలి

Must Read
  • శాంతి క్రిష్ణకు వంశీ విశ్వంభర అవార్డు ప్రకటించిన వంశీ రాజు
  • డా.మల్లిఖార్జున్‌ కిరణ్‌ కుమార్‌, డా.తుంపాల వెంకటేశ్వర్‌రావులకు సత్కారం
  • ఎన్నో సేవలు చేస్తే తప్ప ఇలాంటి సత్కారాలు లభించవు
  • ఘనంగా రవీంద్రభారతిలో శ్రీ శాంతి క్రిష్ణ సేవా సమితి అవార్డుల పంపిణీ

శ్రీ శాంతి క్రిష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని శాసనమండలి మాజీ చైర్మన్‌, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అకాంక్షించారు. ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపడతున్న కార్యక్రమాలు భావితరాలకు స్పూర్తినిస్తున్నాయని చెప్పారు. బుధవారం రవీంద్రభారతిలో శ్రీ శాంతి క్రిష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో 1111వ అంతర్జాతీయ సాంస్కృతిక సంబర మహోత్సవాలను రెండు రోజుల పాటు ఎంతో ఆటాహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాదృక్పథంతో ముందుకు సాగుతున్న ఏసీపీ.డా.కమరిపల్లి మల్లిఖార్జున్‌ కిరణ్‌కుమార్‌, అంతర్జాతీయ పారిశ్రామిక వేత డా.తుంపాల వెంకటేశ్వర్‌రావులను గాయత్రి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ డా.శ్రాకాంతేంద్ర స్వాముల వారి ఆశిర్వాదాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సత్కార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో పాటు తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ ఆధ్యక్షులు ఎ.పద్మాచారి, సాహిత్య ఆకాడమీ మాజీ అధ్యక్షులు డా.జూలూరి గౌరిశంకర్‌, అదాబ్‌ హైదరాబాద్‌ సీఎండి.వీరమల్ల సత్యంగౌడ్‌, విశ్వకర్మ ధర్మపీఠం డా.త్రిమూర్తుల గౌరిశంకర్‌, రికార్డ్స్‌ గురు, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గ్రహిత డా.వంగీపురం శ్రీనాథా చారి, కళా బ్రహ్మ వంశీసంస్థల అధినేత వంశీ రామరాజు, మామిడి హరికృష్ణ, సావిత్రి తదితరులు అవార్డు గ్రహితలను శాలువాలు, మోమెంటోలతో సత్కరించారు.

ఈ సందర్భంగా మధుసూదనచారితో పాటు వక్తలు మాట్లాడుతూ ఎన్నో గొప్ప సేవలు చేస్తే తప్ప ఇలాంటి సత్కారాలు లభించవని అభిప్రాయపడ్డారు. ఇలాంటి విశిష్ట ప్రదేశంలో ఇంతటి మహా సత్కారం పొందడం చాలా గొప్ప విషయంగా తెలిపారు. ముఖ్యంగా శాంతి క్రిష్ణ సంస్థ పేరుతో శాంతిక్రిష్ణ చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు. తెలంగాణ సాంస్కృతికి ప్రపంచానికి చాటిచెబుతున్న అయనకు ఎన్ని సన్మానాలు చేసిన తక్కువే అవుతాయన్నారు. ఇప్పటికే అయన సుమారు 54దేశాల్లో ఏకంగా 1111 సత్కారాలు నిర్వహించడం అంటే చిన్నమాట కాదన్నారు. మరో రెండు దశాబ్దాల్లో అయన ఏకంగా వంద దేశాల్లో ఇలాంటి సత్కార కార్యక్రమాలు నిర్వహించాలని అకాంక్షించారు. ఇలాంటి మహోన్నత సేవలు అందిస్తున్న వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ప్రోత్సహం అందించాలన్నారు. సేవా దృక్పథంతో ముందకు సాగుతన్న వ్యక్తులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం శాంతిక్రిష్ణకు ఎమ్మెల్సీ లేదా రవీంద్రభారతి డైరెక్టర్‌గా అవకాశం కల్పించాలన్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతం నుండి వచ్చిన శాంతిక్రిష్ణ కేవలం తన పట్టుదలతో నేడు ఈ స్థాయిలో నిలబడారని కొనియాడారు. నాడు చదవు లేని సమాజం, బడులు లేని గ్రామాలు, చదివించలేని తల్లిదండ్రులు వంటి పరిస్థితులను అధిగమించి శాంతిక్రిష్ణ నేడు యావత్తు ప్రపంచాన్ని చుట్టడం అంటే అంతసులువు కాదన్నారు. సంఘ సంస్కర్త, మంచి సంస్కారం ఎదుటి వారి బాధను తన బాధగా భావించడం చాలా అరుదైన లక్షణంగా పేర్కొన్నారు. మనం అందరం ఇక్కడితే ఆగిపోతాం కాని శాంతిక్రిష్ణ మాత్రం మరో కార్యక్రమం గురించి ఇక్కడి నుండే ఆలోచిస్తారని అన్నారు.

ఈ సందర్భంగా శాంతిక్రిష్ణకు వంశీ విశ్వంబర అవార్డును ప్రధానం చేస్తానని వేధిక నుండి ప్రముఖ కళా బ్రహ్మ వంశీసంస్థల అధినేత వంశీరాజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక అకర్షణగా నిలిచింది. అదే విధంగా కార్యక్రమానికి వచ్చిన ముఖ్యఅతిథులను కార్యక్రమ నిర్వాహకులు శాలువాలు మోమెంటోలతో సత్కరించారు.

Latest News

2.2 లక్షల ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోకరా: బీఆర్ఎస్

హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్‌ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS