Thursday, July 24, 2025
spot_img

మైనంపల్లి పై నోరు జారితే ఖబర్దార్

Must Read

జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు లు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు పై నోరు జారితే ఖబర్దార్ అంటూ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొంగునూరు ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం దుండిగల్ గండి మైసమ్మ చౌరస్తాలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థాయి నాయకులు తమ స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు మైనంపల్లి హనుమంతరావు చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారు ఆయనను విమర్శించడం వారి అవకాశవాధాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వంటి చేతితో బిఆర్ఎస్ పార్టీ ని విజయతీరాలకు నడిపించినటువంటి వ్యక్తిపై కుప్పి గంతలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఆయన ఇంటి చుట్టూ తిరిగిన విషయాన్ని మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమ నాయకుడిని అంటూ చెప్పుకుంటున్న ఎమ్మెల్సీ ఉద్యమకారులను మరచి తన కుటుంబ సభ్యులకే రాజకీయ భవిష్యత్తును కల్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనంపల్లి హనుమంతరావు పై అనిచిత వాక్యాలు చేస్తే సహించబోమని మరోసారీ పిచ్చిగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో బోరంపేట్ మాజీ సర్పంచ్ యాదిరెడ్డి, డిపిపల్లి మాజీ సర్పంచ్ తలారి యాదగిరి, గాగిల్లాపూర్ శంకర్, తులసి రెడ్డి, కొత్తగూడెం యాదగిరి, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Latest News

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పిఎ హరిబాబు రిమాండ్‌

డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వ‌ర‌కు వసూలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS