Tuesday, August 5, 2025
spot_img

మరోమారు ఎర్రవల్లిలో చండీయాగం

Must Read

పూజా కార్యక్రమాలు చేపట్టినట్లు సమాచారం

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చండీ యాగం రేపటి నుంచి ప్రారంభం కానుందని ప్రచారం సాగుతోంది. ఈ యాగాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వయంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యాగం కోసం సోమ‌వారం ప్రత్యేక పూజలు నిర్వహించారని చెబుతున్నారు. ఈ పూజా కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌, హరీష్‌ రావు, జగదీశ్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ చండీ యాగం మూడు రోజుల పాటు కొనసాగనుంది. మంగళవారం నుంచి అధికారికంగా యాగం ప్రారంభమవుతుందని అంటున్నారు.

ఒకవైపు యాగం ఏర్పాట్లు జరుగుతుండగానే, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్‌, హరీష్‌ రావు, జగదీష్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు సమాచారం. యాగంతో పాటు రాజకీయపరమైన కీలక చర్చలు కూడా ఫామ్‌హౌస్‌లో కొనసాగాయిన, ప్రధానంగా కాళేశ్వరంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారని తెలుస్తోంది.

Latest News

ఖాజాగూడలో పిడుగు ప్రమాదం

భయాందోళనలో స్థానిక ప్ర‌జ‌లు నగర శివారులోని ఖాజాగూడలో సోమవారం సాయంత్రం పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంకోహిల్స్ సర్కిల్‌లోని హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS