Wednesday, October 22, 2025
spot_img

అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత

Must Read

అమెరికా అగ్రరాజ్యంలో మళ్ళీ కాల్పులు కలకలం రేపాయి.లాస్ వెగాస్ లోని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు.మరణించిన వారిలో నలుగురు మహిళలు,13 ఏళ్ల బాలిక ఉంది.అనంతరం కాల్పులు జరిపిన నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. లాస్ వెగాస్ లోని రెండు అపార్ట్మెంట్స్ లో నిందితుడు కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు.ఒక్కసారిగా కాల్పులు జరగడంతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా అగ్రరాజ్యమైన అమెరికాలో వరుసగా కాల్పులు జరుగుతుండడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటికే అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This