Sunday, June 8, 2025
spot_img

మరపురాని మధుర స్నేహ జ్ఞాపకాలతో దేవుని సన్నిధిలో

Must Read

చదువుకునే రోజుల్లో పాఠశాలలో మధుర జ్ఞాపకాలతో గడిపిన ఆ స్నేహితులు 35 సంవత్సరాల తర్వాత ఒక్కటటిపైకి వచ్చి కలుసుకున్నారు.1989- 90 సంవత్సరం టెన్త్ బ్యాచ్ కి చెందిన స్నేహితులు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కలుసుకొని ఆనందంలో మైమరిచిపోయారు.తమ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం తర్వాత ఎవరికివారు విడిపోయారు.కానీ తమలోని స్నేహభావం ఆ అలనాటి మధుర జ్ఞాపకాలు వారిని మళ్లీ ఒక్కటటిపైకి తీసుకొని వచ్చాయి.ఇప్పుడు కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉన్నామని తెలిపారు.ఎవరికి వారు వారివారి బాగోగులను స్నేహితులతో పంచుకున్నారు.తమతోపాటు చదువుకున్న ప్రతి ఒక్కరూ బాగుండాలని స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామిని వేడుకున్నామని తెలిపారు.ముఖ్యంగా తమతో పాటు చదువుకున్న తమ స్నేహితులైన మగ పిల్లలను కూడా తలుచుకున్నారు.కలుసుకున్న వారిలో విజయలక్ష్మి,శోభ,పద్మ,జయలక్ష్మి,టి విజయలక్ష్మి,గీతా రాణి,ఎం విజయలక్ష్మి,పారిజాత తదితరులు ఉన్నారు.

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS