Monday, August 18, 2025
spot_img

ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

Must Read

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తో పాటు మరో నలుగురి పై కేసు నమోదైంది.టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అప్పటి సీబీఐ డీజీగా ఉన్న పీవీ సునీల్ కుమార్ మరికొంత మంది అధికారులతో కలిసి రాజద్రోహం కేసు పెట్టి అనేకరకాలుగా వేధించారని పేర్కొన్నారు.అక్రమ కేసు పెట్టి కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు.రఘురామ కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ1గా సునీల్‌కుమార్‌,ఏ2గా ఇంటెలిజెన్స్‌ మాజీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు,ఏ3గా వైఎస్‌ జగన్‌,ఏ 4గా గత ప్రభుత్వ హయాంలో సీబీఐ ఏఎస్పీగా పని చేసిన విజయ్‌పాల్‌,ఏ 5గా జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతిపై కేసు నమోదు చేశారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS