Thursday, August 21, 2025
spot_img

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు,పోలీసుల తీరుపై మండిపడ్డ జగన్

Must Read

రాష్ట్రంలో అరాచక పాలనా కొనసాగుతున్నదని విమర్శించారు వైసీపీ అధినేత,మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్.సోమవారం అసెంబ్లీ గేటు వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి నల్ల కండువాలతో నిరసన చేపట్టారు.రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ వైఫల్యంపై ఫ్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.దింతో పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ,అధికారం ఎవరికీ శాశ్వతం కాదని,ఈ విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలని మండిపడ్డారు .ఏపీలో పోలీసుల తీరు దారుణంగా తయారైందని ఆరోపించారు.పోలీసుల జులుం శాశ్వతంగా కొనసాగదని అన్నారు.ఈ క్రమంలో పోలీసులు ప్లకార్డులు గుంజుకునే ప్రయత్నం చేశారు.ప్లకార్డులు గుంజుకుని చించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.దింతో కాసేపు అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS