Wednesday, August 20, 2025
spot_img

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన స్పైస్ జెట్

Must Read

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంటూ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.తమ సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మూడు నెలల పాటు సెలవుల పై పంపేందుకు నిర్ణయించింది.ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థకు చెందిన ఓ అధికార ప్రతినిధి ప్రకటించారు.కొన్ని తప్పని పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.150 మంది ఉద్యోగులను తాత్కాలికంగా సెలవుల పై పంపిస్తునట్లు వెల్లడించారు.కానీ వారిని సంస్థ ఉద్యోగులుగానే పరగణిస్తామని స్పస్టం చేశారు.విమానాల సంఖ్య తగ్గిపోవడం,ఇతర కారణాల వల్ల తప్పని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. స్పైస్ జెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.ఎప్పుడు ఎవరిని పంపించేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు.

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS