Friday, October 3, 2025
spot_img

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గుడ్ న్యూస్

Must Read

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎస్.ఎస్.సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) గుడ్ న్యూస్ చెప్పింది. బీఎస్ఎఫ్,సీఆర్పీఎఫ్,సీఐఎస్ఎఫ్,ఎస్.ఎస్.బీ,అస్సాం రైఫిల్స్ దళాల్లో కానిస్టేబుల్ (జీడి) జనరల్ డ్యూటి నియమకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 39,481 పోస్టులను భర్తీ చేయనున్నారు.గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి.ఆసక్తి కలిగిన వారు 2024 అక్టోబర్ 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎస్.ఎస్.సీ తెలిపింది.రాత పరీక్ష,ఫిజికల్ టెస్ట్,మెడికల్ టెస్ట్,సర్టిఫికెట్స్ పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు,మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకుండా ఉండాలి.మరిన్ని వివరాలు ఎస్.ఎస్.సీ అధికార వెబ్‎సైటులో తెలుసుకోవచ్చు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This