Friday, July 4, 2025
spot_img

రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలిపిన ఏపీ కేబినెట్

Must Read

దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. కేబినెట్ భేటీకి ముందు రతన్ టాటా చిత్రపతం వద్ద సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు నివాలర్పించారు. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సంధర్బంగా గుర్తుచేసుకున్నారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్‎ను సృష్టించారని, అయిన మృతి దేశానికి తీరనిలోటని పేర్కొన్నారు.

దిగ్గజ వ్యాపారవేత్త , టాటా గ్రూప్స్ ఛైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాల వల్ల సోమవారం అయిన ఆసుపత్రిలో చేరారు. రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది మూర్ము , ప్రధాని మోదీతో సహ పలుపురు రాజకీయ ప్రముఖులు , సినీ ప్రముఖులు , విదేశ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సంతాపం తెలిపారు.

మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం అధికారికంగా రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది.మరోవైపు రతన్ టాటా మృతి పట్ల మహారాష్ట్ర సీఎం ఏక్‎నాథ్ షిండే గురువారం రాష్ట్రంలో సంతాప దినాన్ని ప్రకటించారు. రతన్ టాటా భౌతికాయనికి నివాలర్పించేందుకు ఉదయం 10 నుండి సాయింత్రం 04 గంటల వరకు ఎన్సీపీఏ లో ఉంచనున్నారు. రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్రం నుండి హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS