Friday, October 3, 2025
spot_img

దివ్వెల మాధురి పై కేసు నమోదు

Must Read

ఏపీలో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.దివ్వెల మాధురి పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆదివారం పలాస జాతీయ రహదారి పై మాధురి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.దింతో పోలీసులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.కానీ తీరా చుస్తే,మాధురి మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో తానే స్వయంగా ఆక్సిడెంట్ చేసుకున్నానని,తనకి ఎలాంటి చికిత్స అవసరం లేదని తేల్చి చెప్పింది.దింతో నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించినందుకు చట్ట ప్రకారం ఆమె పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.గత నాలుగు రోజులుగా దువ్వాడ భార్య వాణి,ఇద్దరు కుమార్తెలు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం ముందు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This