Monday, November 17, 2025
spot_img

మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం

Must Read

నటి నమితకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది.కృష్ణాష్టమి సందర్బంగా తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు.ఈ సందర్బంగా తనను ఆలయ సిబ్బంది అడ్డుకొని హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని,అంతేకాకుండా తనతో పాటు తన కుటుంబసభ్యులతో దురుసుగా మాట్లాడారని నమిత ఓ వీడియోను రిలీజ్ చేశారు.సిబ్బంది చేసిన వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయని వీడియోలో పేర్కొన్నారు.తాను పుట్టుకతో హిందునేనని అన్నారు.తనతో అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రస్తుతం నమిత పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారడంతో ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించారు.పై అధికారుల ఆదేశాల మేరకే ఆలా చేశాం ,కొద్దిసేపు వేచి ఉండమని చెప్పం కానీ ఎక్కడ కూడా నమితను అడ్డుకోలేదు,మర్యాదగానే మాట్లాడమని ఆలయ పరిపాలన సిబ్బంది వివరణ ఇచ్చారు

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This