Tuesday, July 15, 2025
spot_img

అహ్మదాబాద్‌లో వందకోట్ల విలువైన బంగారం పట్టివేత

Must Read

అహ్మదాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఏటీఎస్‌ పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అహ్మదాబాద్‌లోని పాల్ది ప్రాంతంలో గల ఓ ఇంట్లో దాదాపు 100 కిలోలకుపైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. స్మగ్లింగ్‌ చేసిన పసిడిని పాల్ది ప్రాంతంలో గల అవిష్కార్‌ అపార్ట్‌మెంట్‌లో దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు దాడి చేసి 107 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 88 కేజీలు బంగారు కడ్డీలు, 19.66 కిలలో ఆభరణాలు ఉన్నాయి. పట్టుబడిన ఈ బంగారం విలువ మార్కెట్లో రూ.100 కోట్లకుపైమాటే అని అధికారుల అంచనా. బంగారంతోపాటు- రూ.2 కోట్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS