Friday, October 3, 2025
spot_img

భారీ వరదలతో బంగ్లాదేశ్ అతలాకుతలం

Must Read

బాంగ్లాదేశ్ లో భారీ వరదల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.సుమారుగా 50 లక్షల మందికి పైగా ప్రజలు వరదలో చిక్కుకున్నారని,15 మంది మరణించారని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.వీధుల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.11 జిల్లాలో వరదల ప్రభావం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు బాంగ్లాదేశ్ కు వరుస కష్టాలు తప్పడం లేదు.రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే ఆ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.బాంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ కు చేరుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు.ఇప్పుడు తాజాగా ఆ దేశం భారీ వరదలతో అతలాకుతలం అవుతుంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This