Wednesday, July 30, 2025
spot_img

పలు విమానాలకు బాంబు బెదిరింపులు

Must Read

దేశంలో పలు విమానాలకు బాంబు బెదరింపులు రావడం కలకలం రేపుతుంది. గతకొన్ని రోజులుగా దేశంలో అనేక విమానాలకు, రైళ్ళకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా శనివారం దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో సంస్థకు 05 విమానాలకు, విస్తార సంస్థకు చెందిన 03 విమానాలతో పాటు మరికొన్ని విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు, సిబ్బంది వాటిని అత్యవసరంగా దించేశారు.

ఢిల్లీ నుండి లండన్ బయల్దేరిన విస్తారా విమానానికి శనివారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్‎ఫర్ట్‎కు దారి మళ్లించారు. పారిస్ – హాంగ్ కాంగ్, ఢిల్లీ- పారిస్ విస్తారా విమానాలకు కూడా ఈ తరహా బెదిరింపులు రాగా..ఆ విమానాలను అత్యవసరంగా దించేశారు.

దుబాయి నుండి జైపూర్ కు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‎ప్రెస్ విమానానికి బెదిరింపులు రావడంతో ఆ విమానాన్ని జైపూర్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బెంగుళూరు నుండి ముంబయికి వెళ్తున్న ఆకాశ ఎయిర్‎లైన్స్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Latest News

ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం..?

ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS