Sunday, September 14, 2025
spot_img

టీంఇండియా బ్యాటర్స్ కి ఇచ్చే గౌరవం బూమ్ర కి ఇవ్వాలి

Must Read

టీంఇండియా బ్యాటర్స్ కు ఇచ్చే గౌరవం,గుర్తింపు బూమ్ర కూడా ఇవ్వాలని అని అన్నారు టీం ఇండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.ఈరోజు జరగబోయే టీ20 ప్రపంచకప్ లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి.రాత్రి 8 గంటలకు న్యూయార్క్ లో నసౌ కౌంటీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో గౌతం గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సంధర్బంగా గౌతం మాట్లాడుతూ టీం ఇండియా ఎక్స్ ఫ్యాక్టర్ బూమ్రనేనని,విరాట్ కాదని తెలిపాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌ఫార్మాట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా అని అన్నారు. ఈ విషయం అనేక ఏళ్ల క్రితమే తాను చెప్పినట్టు గౌతం గుర్తుచేశాడు.ఎక్కువ గుర్తింపు బూమ్రకే దక్కాలి,కానీ దూరదృష్టవశాత్తు అయినకు ఆ గౌరవం దక్కలేదని,ఎలాంటి సమయంలోనైనా బుమ్ర తన సత్తా చాటుతాడని గౌతం పేర్కొన్నారు.మంచి బౌలర్ గా రాణించాలంటే సరైన ప్రణాళికా,ఆలోచన విధానం ఉండాలని అవి బూమ్రలో ఉన్నాయని అన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This