Sunday, June 15, 2025
spot_img

ఫీజుల దందాకు చెక్.. ఇంజినీరింగ్ కాలేజీలపై సీఎం రేవంత్ కొరడా

Must Read

ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ప్రతిసారీ ఫీజులు పెంచడంపై అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి

ఫీజుల ఖరారుపై లోతైన, శాస్త్రీయ అధ్యయనం చేయాలని ఆదేశం

గత ప్రభుత్వ విజిలెన్స్ నివేదికలపైనా ఆరా తీసిన సీఎం

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చట్టంపై సీఎం సానుకూలత

జులైలో కౌన్సెలింగ్, నెలరోజుల్లో ఫీజుల ఖరారుపై నెలకొన్న సందిగ్ధత

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో తరచూ ఫీజులు పెంచుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలాగే ఫీజులు పెరుగుతూ పోతే భవిష్యత్తులో కన్వీనర్ కోటా సీట్లలో చేరేందుకు కూడా విద్యార్థులు వెనుకాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.

రాబోయే మూడేళ్ల (2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాలు) కాలానికి ఇంజినీరింగ్ కళాశాలలకు కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు అధికారులు రూపొందించిన నివేదికను సీఎంకు సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఫీజుల పెంపునకు అనుసరిస్తున్న ప్రామాణికత ఏమిటని అధికారులను రేవంత్‌రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. “ప్రతిసారీ ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? కళాశాలలు అందిస్తున్న విద్యా నాణ్యత ఏ స్థాయిలో ఉంది? యాజమాన్యాలు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా?” వంటి అంశాలపై ఆయన ఆరా తీశారు. ఫీజుల ఖరారు విషయంలో ఆలస్యమైనా పర్వాలేదని, మరింత లోతుగా, శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.

గతంలో, 2016 విద్యా సంవత్సరంలో, నాటి ప్రభుత్వం 40 విజిలెన్స్ బృందాలను ఇంజినీరింగ్ కళాశాలలకు పంపి, రికార్డులను తనిఖీ చేయించిందని సీఎం గుర్తుచేశారు. ఆ విజిలెన్స్ నివేదికలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను కూడా ఆయన అధికారుల నుంచి కోరినట్లు సమాచారం. ఈ చర్చ సందర్భంగా, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశాన్ని అధికారులు ప్రస్తావించగా, ఇంజినీరింగ్ విద్య తరహాలోనే పాఠశాలల ఫీజుల నియంత్రణకు కూడా ఒక సమగ్రమైన చట్టం తీసుకువద్దామని, దీనిపై కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించినట్టు తెలిసింది.

నెల రోజుల్లో ఫీజుల ఖరారు సాధ్యమేనా?
రాబోయే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ జులై మొదటి లేదా రెండో వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. అప్పటికల్లా ప్రభుత్వం కొత్త ఫీజులను ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేయాలి. అయితే, ఫీజుల ఖరారుపై మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో మిగిలిన నెల రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా కొత్త ఫీజులను సకాలంలో ఖరారు చేయని సందర్భాల్లో, పాత ఫీజులనే వసూలు చేసి, కొత్త ఫీజులు ఖరారైన తర్వాత వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసుకునేలా కళాశాలలకు అనుమతిచ్చారు. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరిస్తారా, లేక ఈ సంవత్సరానికి ఫీజుల పెంపును వాయిదా వేస్తారా అనేది తేలాల్సి ఉంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Latest News

ఈ నెల 19న శుభాన్షు శుక్లా యాత్ర

తాజా తేదీని ప్రకటించిన ఇస్రో టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS