ఈ నెల 21 తేదీన అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని చేపట్టనున్న కార్యక్రమ ఏర్పాట్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. యోగా డే కోసం చేసిన ఏర్పాట్లను యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి.కృష్ణబాబు సీఎంకు వివరించారు.

బీచ్ రోడ్డు వెంబడి వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించిన విశాఖ జిల్లా కలెక్టర్ హరెంథిర ప్రసాద్. 607 సచివాలయాల సిబ్బంది ఈ యోగాడే కు హాజరవుతున్న వారిని సమన్వయం చేస్తున్నట్టు తెలిపిన అధికారులు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్న సీఎం. యోగా డే కార్యక్రమంలో పాల్గొనే వారితో మాక్ యోగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉదయం 06:30 నుంచి 08 గంటల వరకు మాక్ యోగా నిర్వహించాలని సూచన.

ట్రాఫిక్ అంతరాయం లేకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించిన ముఖ్యమంత్రి. ప్రధాని సహా ముఖ్యులు పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతాపరంగా చేసిన ఏర్పాట్లను సీఎంకు వివరించిన అధికారులు. వివిధ ప్రాంతాల నుంచి యోగాడే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లను ఏ విధంగా చేశారని అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. ఆర్కే బీచ్ తో పాటు ఇతర ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తూ ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ కు వెళ్లిన ముఖ్యమంత్రి





