Friday, October 3, 2025
spot_img

50వేల లంచం తీసుకుంటూ దొరికిన సిఐ

Must Read

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్‌ స్టేషన్‌ పై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన ఆకస్మిక దాడులలో టౌన్‌ సిఐ ఆంజనేయులు 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఇక ఈ విషయం సంబంధించి అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన నెలలో దొరికిన కోడిపందాల నిందితుడు లక్ష్మణ్‌ రాజు వద్ద నుండి సీఐ 50 వేల లంచం డిమాండ్‌ చేశారని తెలిపారు. దాంతో బాధితుడు గతి లేని పరిస్థితులలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఓ పథకం ప్రకారం.. శనివారం నాడు పోలీస్‌ స్టేషన్‌ లో లంచం తీసుకుంటుండగా టౌన్‌ సిఐని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This