Sunday, May 18, 2025
spot_img

50వేల లంచం తీసుకుంటూ దొరికిన సిఐ

Must Read

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్‌ స్టేషన్‌ పై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన ఆకస్మిక దాడులలో టౌన్‌ సిఐ ఆంజనేయులు 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఇక ఈ విషయం సంబంధించి అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన నెలలో దొరికిన కోడిపందాల నిందితుడు లక్ష్మణ్‌ రాజు వద్ద నుండి సీఐ 50 వేల లంచం డిమాండ్‌ చేశారని తెలిపారు. దాంతో బాధితుడు గతి లేని పరిస్థితులలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఓ పథకం ప్రకారం.. శనివారం నాడు పోలీస్‌ స్టేషన్‌ లో లంచం తీసుకుంటుండగా టౌన్‌ సిఐని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS