Saturday, August 16, 2025
spot_img

మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై నిశిత పర్యవేక్షణ

Must Read

తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయం

ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి, తెలంగాణ ప్రభుత్వం మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని నిశితంగా పర్యవేక్షిస్తూ, ప్రభావిత ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే తెలంగాణ పౌరులకు పూర్తి సహాయాన్ని అందిస్తోంది.

సమన్వయంతో కూడిన ప్రయత్నంతో, ఆరుగురు తెలంగాణ విద్యార్థులు నిన్న అర్ధరాత్రి న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. వీరిలో నలుగురు ఇరాన్ నుంచి, ఇద్దరు ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా వచ్చారు. అందరూ హైదరాబాద్‌కు ముందస్తు విమానాలను బుక్ చేసుకోగా, ఈ రోజు ఉదయం 5:30 గంటలకు హైదరాబాద్ బయలుదేరే వరకు తెలంగాణ భవన్ సిబ్బంది వారికి సహాయం చేశారు.

మరో ఏడుగురు తెలంగాణ పౌరులు ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్‌లోని అమ్మాన్‌కు సురక్షితంగా చేరుకున్నారు. త్వరలోనే న్యూఢిల్లీకి చేరుకోనున్న వీరి కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

ఇజ్రాయెల్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు తలెత్తినప్పటికీ, ఈ సవాళ్లను అధిగమించి, ప్రభావిత పౌరులందరికీ సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సంబంధిత అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతర సమన్వయంతో పనిచేస్తోంది.

స్వదేశానికి వచ్చే ప్రతి తెలంగాణ నివాసికి సకాలంలో సహాయం, సరైన వసతి, తదుపరి ప్రయాణ సౌకర్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.

పౌరులంతా అధికారిక మార్గాలనే అనుసరించాలని, ధృవీకరించని సమాచారంపై ఆధారపడరాదని సూచనలు జారీ అయ్యాయి. ఈ క్లిష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వం పౌరులకు అండగా నిలుస్తూ వారి భద్రతకు, త్వరితగతిన స్వదేశానికి రప్పించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS