బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేసీఆర్ పీసీ ఘోష్ విచారణకు వచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ ఇవాళ (జూన్ 11 బుధవారం) కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారి జీవితం ఒక మరపురాని చరిత్రగా నిలిచిపోతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయలేని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ విజయవంతంగా చేశారని తెలిపారు. ప్రజాస్వామ్య పోరాటంతో తెలంగాణ ఆర్తితో తెలంగాణ కోసం, కేవలం తెలంగాణ కోసమే కేసీఆర్ పనిచేశారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఉద్యమం ద్వారా కోట్లాది మంది స్వరాష్ట్ర ఆశయాన్ని కేసీఆర్ సాధించారని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించటం ద్వారా రాష్ట్రంలోని కరువుకు, దాహానికి శాశ్వత పరిష్కారం చూపించారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ బలాన్ని, జీవన దృక్కోణాన్ని అర్థంచేసుకోవడానికి జోకర్ కాంగ్రెస్ నాయకులకు జీవితకాలం కూడా చాలదని ఎద్దేవా చేశారు. అల్ప మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నేతలు 100 జన్మలెత్తినా కూడా కేసీఆర్ సాధించిన విజయాల్లో పదో వంతైనా సాధించలేరని కేటీఆర్ తేల్చిచెప్పారు.