Monday, August 18, 2025
spot_img

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్,09 మంది మావోయిస్టులు మృతి

Must Read

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం దంతేవాడలో భద్రత బలగాలకు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో 09 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.నిఘావర్గాల సమాచారం మేరకు దంతేవడా-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి.ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో 09 మంది మావోలు మృతిచెందారని అధికారులు వెల్లడించారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.ఘటన స్థలంలో భద్రత బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు డిఆర్జీ (drg) బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయని బస్టర్ రేంజ్ పోలీస్ ఇన్స్ పెక్టర్ జనరల్ సుందర రాజ్ తెలిపారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS