Saturday, June 7, 2025
spot_img

రెండు రాష్ట్రాల్లో ఒకే తేదీల్లో పరీక్షలు

Must Read

ఇరకాటంలో ‘తెలుగు’ అభ్యర్థులు

రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు అనుకోని ఇబ్బంది వచ్చింది. ఉపాధ్యాయ పరీక్షలు ఒకే తేదీల్లో రావటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఈ నెల (జూన్) 18 నుంచి 30 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) జరగనుంది. ఏపీలో ఈ నెల (జూన్) 6 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో వాళ్లు ఏవి రాయాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు. నాన్‌ లోకల్‌ కింద 20 శాతం టీచర్ పోస్టులకు పోటీపడేందుకు తెలంగాణ నుంచి దాదాపు 7 వేల మంది ఈ పరీక్షకు అప్లై చేశారు.

కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్, ఏపీ డీఎస్సీ పరీక్షలు ఉండటం వల్ల వాళ్లు ఏదైనా ఒక్క పరీక్ష మాత్రమే రాసేందుకు వీలుంటుంది. కొందరికి హైదరాబాద్‌లోనే ఎగ్జామ్ సెంటర్లు ఉండగా మరికొందరు ఏపీ వెళ్లాల్సి వస్తోంది. 20వ తేదీన ఎక్కువ మందికి ఇటు టెట్‌ పేపర్‌-1.. అటు ఏపీ డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులకు పరీక్ష ఉండటం గమనార్హం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. తేదీలు మారకపోతే.. టెట్‌ ప్రతి సంవత్సరం రెండు సార్లు జరుగుతుంది కాబట్టి అరుదుగా నిర్వహించే డీఎస్సీ‌కే ప్రాధాన్యత ఇచ్చి టెట్‌ను వదులుకోవాలని పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు.

Latest News

కోహ్లీని అరెస్ట్ చేయాలి

ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని అరెస్ట్‌ చేయాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS